జేఎన్టీయూలో ఐదున్నరేండ్ల ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ కోర్సు..జర్మనీ వర్సిటీలతో ఎంవోయూ 

జేఎన్టీయూలో ఐదున్నరేండ్ల ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ కోర్సు..జర్మనీ వర్సిటీలతో ఎంవోయూ 
  • మూడేండ్లు ఇక్కడ, ఆ తర్వాత జర్మనీలో చదివే చాన్స్ 
  • ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు షురూ : జేఎన్టీయూ వీసీ 

కూకట్​పల్లి, వెలుగు: జేఎన్టీయూ, జర్మనీ వర్సిటీల మధ్య ఐదున్నరేండ్ల ఇంటర్నేషనల్​ ఇంటిగ్రేటెడ్​బీటెక్, మాస్టర్స్​ప్రోగ్రామ్​కు అగ్రిమెంట్​కుదిరింది. గురువారం జేఎన్టీయూలో జరిగిన కార్యక్రమంలో వర్సిటీ వీసీ కిషన్​కుమార్​రెడ్డి.. జర్మనీలోని రూట్లింగెన్, కాసెల్​వర్సిటీల ప్రతినిధులతో ఎంవోయూ చేసుకున్నారు. రూట్లింగెన్​ వర్సిటీ సీఈఓ డానియల్​జెగిస్, కాసెల్​వర్సిటీ డీన్​డిర్క్​డల్లాస్​అగ్రిమెంట్ పై సంతకాలు చేశారు. బీటెక్ లో తొలి మూడేండ్లు జేఎన్టీయూలో చదివి, మిగతా రెండున్నరేండ్లు జర్మనీలోని ఆయా వర్సిటీల్లో కోర్స్​పూర్తి చేసే చాన్స్ ఉంటుందని వీసీ తెలిపారు.

మాస్టర్స్​లో ఒక సెమిస్టర్​ జేఎన్టీయూలో చదివి, ఏడాదిన్నర జర్మనీలో చదవాలని చెప్పారు. 2025–26 విద్యా సంవత్సరానికి జేఈఈ మెయిన్, ఎంసెట్, ఇంటర్​మార్కుల ఆధారంగా కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు. జర్మనీలో చదువుకోవాలనే స్టూడెంట్స్​కు ఇది మంచి అవకాశమని సూచించారు. ఆయా  కోర్సుల్లో జాబ్​ఓరియంట్​ప్రోగ్రామ్స్​తో పాటు వారానికి 20 గంటల పాటు జర్మనీలోనే జాబ్ చేసుకునే చాన్స్ ఉంటుందని పేర్కొన్నారు.