
- మూడేండ్లు ఇక్కడ, ఆ తర్వాత జర్మనీలో చదివే చాన్స్
- ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు షురూ : జేఎన్టీయూ వీసీ
కూకట్పల్లి, వెలుగు: జేఎన్టీయూ, జర్మనీ వర్సిటీల మధ్య ఐదున్నరేండ్ల ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్బీటెక్, మాస్టర్స్ప్రోగ్రామ్కు అగ్రిమెంట్కుదిరింది. గురువారం జేఎన్టీయూలో జరిగిన కార్యక్రమంలో వర్సిటీ వీసీ కిషన్కుమార్రెడ్డి.. జర్మనీలోని రూట్లింగెన్, కాసెల్వర్సిటీల ప్రతినిధులతో ఎంవోయూ చేసుకున్నారు. రూట్లింగెన్ వర్సిటీ సీఈఓ డానియల్జెగిస్, కాసెల్వర్సిటీ డీన్డిర్క్డల్లాస్అగ్రిమెంట్ పై సంతకాలు చేశారు. బీటెక్ లో తొలి మూడేండ్లు జేఎన్టీయూలో చదివి, మిగతా రెండున్నరేండ్లు జర్మనీలోని ఆయా వర్సిటీల్లో కోర్స్పూర్తి చేసే చాన్స్ ఉంటుందని వీసీ తెలిపారు.
మాస్టర్స్లో ఒక సెమిస్టర్ జేఎన్టీయూలో చదివి, ఏడాదిన్నర జర్మనీలో చదవాలని చెప్పారు. 2025–26 విద్యా సంవత్సరానికి జేఈఈ మెయిన్, ఎంసెట్, ఇంటర్మార్కుల ఆధారంగా కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు. జర్మనీలో చదువుకోవాలనే స్టూడెంట్స్కు ఇది మంచి అవకాశమని సూచించారు. ఆయా కోర్సుల్లో జాబ్ఓరియంట్ప్రోగ్రామ్స్తో పాటు వారానికి 20 గంటల పాటు జర్మనీలోనే జాబ్ చేసుకునే చాన్స్ ఉంటుందని పేర్కొన్నారు.