హైదరాబాద్, వెలుగు: కరోనా రోగులకు సేవలు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ నరేశ్ భార్యకు గ్రూప్ వన్ కేడర్ ఉద్యోగం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ నరేశ్ భార్య పావనికి గురువారం ఈ ఉత్తర్వులను అందజేశారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ ఆఫీసులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఆమెకు పోస్టింగ్ ఇస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని పావనికి సూచించారు. తన భర్త సేవలను గుర్తించి, తనకు ఉద్యోగం ఇచ్చినందుకు పావని మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా టైమ్లో భద్రాది కొత్తగూడెం డిప్యూటీ డీఎంహెచ్వోగా, జిల్లా కరోనా నోడల్ ఆఫీసర్గా డాక్టర్ నరేశ్ పనిచేశారు. ఈ క్రమంలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కేంద్రం నరేశ్ భార్యకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వగా, రాష్ట్ర సర్కార్ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. ఈ నియామకం పట్ల తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ కత్తి జనార్దన్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
For More News..