ట్రంప్ తెచ్చిన పౌరసత్వ పరీక్షను రద్దు చేసిన బైడెన్​

ట్రంప్ తెచ్చిన పౌరసత్వ పరీక్షను రద్దు చేసిన బైడెన్​

డొనాల్డ్ ట్రంప్ గతేడాది తెచ్చిన పౌరసత్వ పరీక్షను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రద్దు చేశారు. అర్హులైన అభ్యర్థులందరికీ సిటిజెన్షిఫ్ ఇచ్చేందుకు 2008 నాటి పద్ధతినే అమలు చేస్తామని ప్రకటించారు. అమెరికా పౌరులు కావాలనుకునే వారు ఇంగ్లీష్ అర్థం చేసుకుని, సివిక్స్ పరీక్షలో పాస్ అయితే చాలన్న పాత నిబంధనలనే మళ్లీ తీసుకొచ్చారు. దీనికి సంబంధించి అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) ప్రకటన జారీ చేసింది.

గతేడాది డిసెంబర్ లో తీసుకొచ్చిన కొత్త నిబంధనల కారణంగా పౌరసత్వం ఇచ్చే ప్రక్రియలో సహజత్వం దెబ్బతింటుందని, దీంతో దానిని రద్దు చేసి మళ్లీ పాత పద్ధతిలోనే పరీక్ష నిర్వహిస్తామని బైడెన్ ప్రభుత్వం తెలిపింది. అయితే.. ఇప్పటిదాకా కొత్త పద్ధతిలో పరీక్షకు రెడీ అవుతున్న వారి కోసం ఏప్రిల్ 19 వరకు ‘ట్రంప్’ రూల్ ప్రకారమే పరీక్ష రాయొచ్చని, 2021 మార్చి 1 తర్వాత దరఖాస్తు చేసుకున్న వారు 2008 పద్ధతి ప్రకారం పరీక్ష రాయొచ్చని USCIS తెలిపింది.