వాషింగ్టన్ డీసీ జిల్లా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ 

వాషింగ్టన్ డీసీ జిల్లా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ 

అమెరికాలో మరో తెలుగు మహిళకు అరుదైన పదవి దక్కింది. వాషింగ్టన్ డీసీ జిల్లా కోర్టు జడ్జిగా రూపా రంగా పుట్టగుంట నియమితులయ్యారు. మొత్తం 11 మంది జడ్జిలను నామినేట్ చేసిన ప్రెసిడెంట్ బైడెన్ అందులో తెలుగు సంతతికి చెందిన రూపాకు అవకాశమిచ్చారు. ఈ ప్రతిపాదనకు సెనెట్ ఆమోదం తెలపడం లాంఛనమే కానుంది.

రూపా రంగా పుట్టగుంట అమెరికాలో సెటిలైన తెలుగు కుటుంబ వారసురాలు. ఆమె స్వస్థలం ఏపీలోని కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కలవపాముల. వీరు చాలా ఏళ్ల కిందటే అమెరికాలో స్థిరపడ్డారు. ఇప్పుడు ఆమెకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఓ ఉన్నత అవకాశం కల్పించారు.