సొంతగూటికి ఊదరి గోపాల్.. మంత్రి హరీశ్​రావు సమక్షంలో బీఆర్ఎస్​లో చేరిక

సొంతగూటికి ఊదరి గోపాల్.. మంత్రి హరీశ్​రావు సమక్షంలో బీఆర్ఎస్​లో చేరిక

హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ కార్మిక విభాగం నుంచి గుర్తింపు పొందిన యూనియన్ ప్రెసిడెంట్, జీహెచ్ఎంఈ యూ ప్రెసిడెంట్ ఊదరి గోపాల్ సొంత గూటికి చేరారు. బీజేపీ మజ్దూర్ మోర్చా సిటీ చైర్మన్ గా ఉన్న గోపాల్ ఆ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం మంత్రి హరీశ్ రావు సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాబోతుందని, బల్దియా ఔట్​ సోర్సింగ్ కార్మికులు, పర్మినెంట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. 

సొంతగూటికి చేరుకోవడం ఆనందంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో గతంలో బల్దియాఆఫీస్ పై గులాబీ జెండా ఎగురవేశామని గుర్తు చేశారు. గోపాల్ తో పాటు డి.నర్సింగ్ రావు, కన్నా, ఎం. కృష్ణ, మల్లేశ్​, కృష్ణ, శ్రీను, చిన్న, సురేశ్, సంజీవ, హనుమంతు, తదితరులు బీఆర్ఎస్ కార్మిక విభాగంలో చేరారు.