హనుమకొండ, వెలుగు : స్వాతంత్ర భారత వజ్రోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా రెడీ అయింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆఫీసర్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా వివిధ ఉత్సవాలు నిర్వహిస్తుండగా.. పంద్రాగస్టు వేడుకలను గ్రాండ్ గా జరిపేందుకు సిద్ధమయ్యారు. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ ప్రముఖులు చీఫ్ గెస్ట్ గా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన చేయనున్నారు. హనుమకొండ జిల్లా ఉత్సవాలను పోలీస్పరేడ్గ్రౌండ్లో నిర్వహించనుండగా.. చీఫ్గెస్ట్గా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హాజరుకానున్నారు. జనగామ జిల్లాలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మహబూబాబాద్లో మంత్రి సత్యవతి రాథోడ్, వరంగల్ జిల్లాలో ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లిలో ప్రభుత్వ సలహాదారు అనురాగ్శర్మ, ములుగులో శాసనమండలి విప్ ఎంఎస్ ప్రభాకర్రావు వేడుకల్లో పాల్గొననున్నారు. కాగా వర్షాల నేపథ్యంలో ఉత్సవాలకు తరలివచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆఫీసర్లు టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఓసిటీ గ్రౌండ్లో వజ్రోత్సవాలు ప్రారంభం
వరంగల్ సిటీ, వెలుగు: వీరుల త్యాగాలతోనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని తూర్పు ఎమ్మెల్యే నరేందర్, వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి అన్నారు. ఆదివారం రాత్రి ఓసిటీలోని గ్రౌండ్లో 75వ స్వాతంత్ర్య వేడుకలను ప్రారంభించారు. ముందుగా ఓసిటీ గ్రౌండ్లో జానపద కళా ప్రదర్శనను పటాకులు పేల్చి సంబురంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళా ప్రదర్శన చేసిన తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులను కలెక్టర్, ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, ఆర్డీవో మహేందర్ జీ, కార్పొరేటర్లలు పాల్గొన్నారు.