Shubman Gill: ఐపీఎల్ ఎఫెక్ట్: కోహ్లీ, రోహిత్‌ను కలిపితే గిల్.. కొత్త కెప్టెన్‌ను ఆకాశానికెత్తేసిన స్టార్ క్రికెటర్

Shubman Gill: ఐపీఎల్ ఎఫెక్ట్: కోహ్లీ, రోహిత్‌ను కలిపితే గిల్.. కొత్త కెప్టెన్‌ను ఆకాశానికెత్తేసిన స్టార్ క్రికెటర్

రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత జట్టుకు సరైన కెప్టెన్ లేడు. అందుబాటులో ఉన్న శుభమాన్ గిల్ ను టెస్ట్  కెప్టెన్ గా ప్రకటించినా అతనికి అనుభవం లేదు. అంతేకాదు గిల్ కు కనీసం ఇంగ్లాండ్ గడ్డపై బ్యాటింగ్ లో ఘోరమైన రికార్డ్ ఉంది. రోహిత్ రిటైర్మెంట్ ఇచ్చిన కొన్ని రోజుల వ్యవధిలోనే కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పడంతో భారత జట్టుకు కష్టాలు ఎక్కువయ్యాయి. దీంతో బ్యాటింగ్ ఆర్డర్ లో అనుభవం లేకపోగా.. టీమిండియా ఇద్దరు దిగ్గజాలు లేకుండానే ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టబోతుంది.   

ALSO READ | Karun Nair: రిటైర్మెంట్ ఇచ్చి కౌంటీ క్రికెట్ ఆడుకోమన్నాడు: మాజీ స్టార్ ప్లేయర్‌పై కరుణ్ నాయర్ సంచలన కామెంట్స్

జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ తో భారత్ 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ మెగా సిరీస్ గిల్ కు అగ్ని పరీక్షగా మారింది. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ లోనూ గిల్ రాణించాల్సి ఉంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ పిచ్ లపై గిల్ విఫలమవుతాడనే తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ విధ్వంసకర వీరుడు జోస్ బట్లర్ యువ క్రికెటర్ గిల్ పై పూర్తి నమ్మకముంచాడు. అంతేకాదు గిల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఆకాశానికెత్తేసాడు. స్టూవర్ట్ బ్రాడ్‌తో అతని కొత్త పాడ్‌కాస్ట్ ఫర్ ది లవ్ ఆఫ్ క్రికెట్ గురించి మాట్లాడుతూ గిల్ గురించి ఈ విధంగా చెప్పుకొచ్చాడు.  

" గిల్ నిజంగా తన బ్యాటింగ్ తో ఆకట్టుకుంటాడు. అతను మాట్లాడేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటాడు. మైదానంలో గిల్ కొంచెం దూకుడుగా .. మరికొన్ని సందర్భాల్లో చాల ప్రశాంతంగా కనిపిస్తాడు. కోహ్లీ, రోహిత్ లలో అది మనం గమనించవచ్చు. కోహ్లీ, రోహిత్ లను కలిపితే అదే గిల్. వీరిద్దరితో కలిసి క్రికెట్ ఆడడం వలన గిల్ చాలా విషయాలు నేర్చుకున్నాడు". అని బట్లర్ తెలిపాడు. ఐపీఎల్‌లో బట్లర్ గిల్ కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడాడు. ఈ కారణంగానే గిల్ ను ఎంకరేజ్ చేసి మాట్లాడవచ్చని తెలుస్తుంది. ఐపీఎల్ 2025 లో గుజరాత్ టైటాన్స్ కు గిల్ సమర్ధవంతంగా నడిపించి ప్లే ఆఫ్స్ కు తీసుకెళ్లాడు. 

ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా లీడ్స్‌లోని హెడ్డింగ్లేలో జూన్ 20 న తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లోని మిగతా నాలుగు టెస్టులకు ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్ ఓవల్ వేదికలు కానున్నాయి. 2021-22 చివరిసారిగా భారత్ ఇంగ్లాండ్ లో పర్యటించింది. ఈ సిరీస్ 2-2 తో సమంగా ముగిసింది. 2024 ప్రారంభంలో ఇంగ్లాండ్, భారత్ చివరిసారిగా టెస్ట్ సిరీస్ ఆడాయి. ఈ సిరీస్ ను భారత్ 4-1 తేడాతో గెలుచుకుంది.