మలబార్​ బ్రాండ్ అంబాసిడర్​గా జూనియర్​ ఎన్టీఆర్

మలబార్​ బ్రాండ్ అంబాసిడర్​గా జూనియర్​ ఎన్టీఆర్

హైదరాబాద్​, వెలుగు: మలబార్ గోల్డ్ & డైమండ్స్ తన బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా జూనియర్​ ఎన్టీఆర్​ను కొనసాగించనుంది. ఇక నుంచి రాబోయే యాడ్స్​లోనూ ఆయన కనిపిస్తారని తెలిపింది. జూనియర్​ ఎన్టీఆర్​కు ఉన్న పాపులారిటీ కారణంగా తమ కస్టమర్ బేస్‌‌‌‌‌‌‌‌ను మరింత విస్తరిస్తుందని తెలిపింది. బ్రాండ్​అంబాసిడర్​గా ఎంపిక కావడంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ అత్యంత విశ్వసనీయమైన నగల బ్రాండ్‌‌‌‌‌‌‌‌లలో ఒకటైన మలబార్​తో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. 

ఈ సంస్థ ప్రపంచ వేదికపై భారతీయ డిజైన్‌‌‌‌‌‌‌‌లు, కళలు, సంస్కృతులను  ప్రదర్శిస్తున్నదని తెలిపారు. మలబార్ గోల్డ్ & డైమండ్స్​కు భారతదేశంతోపాటు యూకే, యూఏఈ, కేఎస్​ఏ,  ఖతార్, బహ్రెయిన్, ఒమన్, కువైట్, మలేషియా, సింగపూర్, యూఎస్​లో విస్తృతమైన రిటైల్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, బంగ్లాదేశ్, టర్కీ,  న్యూజిలాండ్ వంటి కొత్త మార్కెట్‌‌‌‌‌‌‌‌లతో పాటు భారతదేశంలోని మరిన్ని నగరాల్లోకి ప్రవేశించేందుకు గ్రూప్ ప్రణాళికలను సిద్ధం చేసింది.