హైదరాబాద్, వెలుగు: మలబార్ గోల్డ్ & డైమండ్స్ తన బ్రాండ్ అంబాసిడర్గా జూనియర్ ఎన్టీఆర్ను కొనసాగించనుంది. ఇక నుంచి రాబోయే యాడ్స్లోనూ ఆయన కనిపిస్తారని తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న పాపులారిటీ కారణంగా తమ కస్టమర్ బేస్ను మరింత విస్తరిస్తుందని తెలిపింది. బ్రాండ్అంబాసిడర్గా ఎంపిక కావడంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ అత్యంత విశ్వసనీయమైన నగల బ్రాండ్లలో ఒకటైన మలబార్తో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
ఈ సంస్థ ప్రపంచ వేదికపై భారతీయ డిజైన్లు, కళలు, సంస్కృతులను ప్రదర్శిస్తున్నదని తెలిపారు. మలబార్ గోల్డ్ & డైమండ్స్కు భారతదేశంతోపాటు యూకే, యూఏఈ, కేఎస్ఏ, ఖతార్, బహ్రెయిన్, ఒమన్, కువైట్, మలేషియా, సింగపూర్, యూఎస్లో విస్తృతమైన రిటైల్ నెట్వర్క్ ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, బంగ్లాదేశ్, టర్కీ, న్యూజిలాండ్ వంటి కొత్త మార్కెట్లతో పాటు భారతదేశంలోని మరిన్ని నగరాల్లోకి ప్రవేశించేందుకు గ్రూప్ ప్రణాళికలను సిద్ధం చేసింది.