పిచ్చి అభిమానం : ఇటుక ఇటుకపై జూనియర్ ఎన్టీఆర్.. అప్పట్లో జైశ్రీరాం లెక్క

పిచ్చి అభిమానం : ఇటుక ఇటుకపై జూనియర్ ఎన్టీఆర్.. అప్పట్లో జైశ్రీరాం లెక్క

ఇటుకలపై పేర్లు.. మొదటగా ఇది మొదలైంది.. ప్రపంచానికి తెలిసింది అయోధ్యలోని రామ మందిర నిర్మాణం ఇష్యూతోనే. అప్పట్లో దేశవ్యాప్తంగా ఎంతో మంది హిందువులు రాముడి ఆలయ నిర్మాణం కోసం జై శ్రీరాం అనే పేరుతో ఉన్న ఇటుకలు తయారు చేయించి అయోధ్యకు పంపించారు. ఇది దేవుడిపై ఉన్న నమ్మకం.. విశ్వాసం. 

ఇప్పుడు అలాంటి తరహానే.. ఓ హీరోపై తన అభిమానాన్ని చూపించారు అభిమాని. ఆ హీరో మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్. ఈ హీరో అభిమాని తన చిరకాల కోరిక అయిన సొంతింటి నిర్మాణం కోసం ఎన్టీఆర్ పేరుతో ఉన్న ఇటుకలను ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాడు. ఆంద్రప్రదేశ్ కర్నూల్ కు చెందిన ఈ అభిమానికి చిన్నప్పటినుండి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. అందుకే.. తన అభిమాన హీరోపై తనకున్న ఇష్టాన్ని ఈ రూపకంగా చూపించుకున్నారు. ఇక నుండి ఆ అభిమాని గుండెల్లోనే కాదు.. అతను బతికినంత కాలం ఉండే ఇంటిలోనూ ఎన్టీఆర్ ఉంటాడు.

ఇక లక్షల సంఖ్యలోని ఎన్టీఆర్ పేరుతో ఉన్న ఇటుకల ఫొటోలు ఇప్పుడు నేషనల్ లెవల్లో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్ ను గ్రేట్ భయ్యా అంటూ ఆ వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజమైన అభిమాని అంటే నువ్వే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read :- కావాలనే నెగిటివ్ చేస్తున్నారు.. రాహుల్పై రతిక చెల్లెలు సంచలన కామెంట్స్