హీటెక్కిన జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం

హీటెక్కిన జూబ్లీహిల్స్ బైపోల్  ప్రచారం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం హీటెక్కింది. విజయమే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు బరిగీసి కొట్లాడుతున్నాయి. కాంగ్రెస్​ నుంచి ఇన్నాళ్లూ మంత్రుల వరకే ప్రచారంలో పాల్గొనగా, శుక్రవారం స్వయంగా సీఎం రేవంత్​ రంగంలోకి దిగారు. వెంగళరావునగర్​, సోమాజిగూడ డివిజన్లలో​ రోడ్​షోలు, కార్నర్​ మీటింగ్‌‌లతో హోరెత్తించారు. 

జూబ్లీహిల్స్‌‌ గడ్డపై కాంగ్రెస్‌‌ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు. అటు ఎర్రగడ్డ డివిజన్‌‌లో బీజేపీ తరఫున కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి, షేక్‌‌పేట డివిజన్‌‌లో బీఆర్ఎస్‌‌ తరఫున ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ పోటాపోటీ ప్రచారం నిర్వహించారు. ముగ్గురు నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో విరుచుకుపడ్డారు. ఈ నెల 11న జూబ్లీహిల్స్​  ఉప ఎన్నిక జరగనున్నది. 14న ఫలితం తేలనున్నది.