కాంగ్రెస్ లో జూబ్లీహిల్స్ టికెట్ వార్ జరుగుతోంది. పీజేఆర్ తనయుడు విష్ణువర్దన్ రెడ్డి ఇప్పటికే బరిలో ఉండగా మాజీ ఎంపీ అజారుద్దీన్ కూడా జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో అజారుద్దీన్ జూబ్లీహిల్స్ లో విష్ణువర్దన్ రెడ్డి వ్యతిరేక వర్గంతో అజారుద్దీన్ భేటీ కావడం చర్చనీయాంశంగ మారింది.
కృష్ణానగర్ లో కందాల ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో విష్ణువర్దన్ వ్యతిరేక వర్గం భవానీ శంకర్ తో పాటు కాంగ్రెస్ యూత్ నాయకులు అనిల్ కమార్ యాదవ్ కూడా పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి..తప్పకుండా విజయం సాధిస్తానన్నారు అజారుద్దీన్