- జడ్జీ మెండు రాజమల్లు
- సంస్థ ఆధ్వర్యంలో 200 మంది స్టూడెంట్స్కు సైకిల్స్ పంపిణీ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పేద స్టూడెంట్స్ అండగా గ్రామ స్వరాజ్య సంస్థ ఉందని స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు పేర్కొన్నారు. చుంచుపల్లి మండలంలోని రాంనగర్లోని గ్రామ స్వరాజ్య సంస్థ జిల్లా ఆఫీస్లో బుధవారం ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో పేద స్టూడెంట్స్కు ఆయన సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆకాంక్షించారు.
గ్రామ స్వరాజ్య సంస్థ గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతూ దూరాభారంతో ఇబ్బంది స్టూడెంట్స్కు సైకిల్స్ పంపిణీ చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఎంతో మంది పేద స్టూడెంట్స్ దూరంలో ఉన్న స్కూళ్లకు సక్కగా వెళ్లలేక మధ్యలోనే మానేస్తుండడం బాధాకరమన్నారు. సంస్థ సీఈఓ ప్రదీప్ తో పాటు సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లాలోని చుంచుపల్లి మండలంతో పాటు మారుమూల ఏజెన్సీ గ్రామాల్లోని మొత్తం 200 మంది పేద స్టూడెంట్స్ సైకిళ్లు పంపిణీ చేస్తోందన్నారు. తమ సంస్థ ప్రజలతో కలిసి పనిచేస్తూ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ డీకొండ దుష్యంత్ కుమార్, పుష్పరాజు, పెండకంట్ల హరికృష్ణ, హరీశ్, బాబూరావు, రవి రెగల్లా పాల్గొన్నారు.
