గద్వాల, వెలుగు: ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జడ్జి రవికుమార్ కోరారు. సోమవారం కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై పోలీస్ ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించారు. రాజీ కాదగిన వీలైనన్ని ఎక్కువ కేసుల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. రాజీ ద్వారా కేసుల పరిష్కారం చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. కోర్టు చుట్టూ తిరగకుండా ఇరువర్గాలను సమన్వయపరిచి కేసులను రాజీ చేసే విధంగా అవేర్నెస్ కల్పించాలన్నారు.
