తెలంగాణలో న్యాయ వ్యవస్థ లాక్డౌన్ను హైకోర్టు మరోసారి పొడిగించింది. కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్ డౌన్ను జూన్ 28 వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర, తుది విచారణ కేసులు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని జిల్లా కోర్టులకు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు వైపుల లాయర్లు ప్రత్యక్ష విచారణ కోరితే జ్యుడిషియల్ అకాడమీలో ఏర్పాట్లు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
జిల్లా, మేజిస్ట్రేట్ కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్ డౌన్ ఈ నెల 14 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. అత్యవసర, కుటుంబ వివాదాలకు సంబంధించిన కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టాలని సూచించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా ఇతర జిల్లాల్లో నేరుగా పిటిషన్లను దాఖలు చేసేందుకు వెసులుబాటు కల్పించింది. కోర్టుల్లో మాస్కులు, శానిటైజేషన్ వంటి జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు… కోర్టులను ఆదేశించింది.