నటి జూహీ చావ్లా.. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్తో ఉన్న సన్నిహిత బంధాన్ని పంచుకున్నారు. డ్రగ్స్ కేసులో షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కోసం రూ. 1 లక్ష బాండ్కు పూచీకత్తుగా జూహీ సంతకం చేయడం... అప్పట్లో సంచలనంగా మారింది. అక్టోబర్ 2021లో డ్రగ్ కేసులో బాంబే హైకోర్టు బెయిల్ షరతులను విధించగా.. ఆ తర్వాత జూహీ ఆర్యన్ కోసం బాండ్పై సంతకం చేసింది. ఈ విషయంపై ఆర్యన్ తరపు న్యాయవాది సతీష్ మానేషిండే మాట్లాడుతూ.. "ఆమె (జూహీ చావ్లా) వృత్తిపరంగా షారుఖ్ తో మంచి సంబంధం కలిగి ఉన్నారని, ఆర్యన్ పుట్టినప్పటి నుంచి ఆమె వారికి పరిచయమేనని తెలిపాడు.
ఇక తాజాగా ఆ విషయంపై జూహీ స్పందించింది. అదొక ఊహించని సంఘటనగా పేర్కొంది. కానీ ఆ సమయంలో తాను ఆ పని చేయడం సరైనదేనని భావించినట్టు చెప్పుకొచ్చింది. ఇలాంటి సందర్భం వస్తుందని ఊహించలేదని జూహీ తెలిపింది. కానీ ఆ సమయంలో తాను చేయగలిగిన సహాయం చేయాలనుకున్నానని, అలా చేయడమే కరెక్ట్ అని తాను అనుకుని అలా చేసినట్టు జూహీ స్పష్టం చేసింది.
షారుఖ్ తో తన బంధం గురించి చెప్పిన జూహీ.. తాను షారుఖ్ ను చాలా అరుదుగా చూస్తుంటానని, కానీ తన భర్త జే మెహతా మాత్రం అతనితో ఎల్లప్పుడూ టచ్లో ఉంటాడని చెప్పింది. అయినప్పటికీ తాము చాలా సన్నిహితంగా ఉంటామని తెలిపింది.