17 నెలలపాటు పదవిలో
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే సోమవారం ప్రమాణం చేయనున్నారు. సీజేఐ రంజన్ గొగోయ్ పదవీకాలం ముగియడంతో 63 ఏళ్ల జస్టిస్ బోబ్డే సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. 17 నెలలపాటు సీజేఐగా కొనసాగనున్నారు. 2021 ఏప్రిల్ 23న రిటైర్ కానున్నారు. మహారాష్ట్రలోని లాయర్ల కుటుంబానికి చెందిన జస్టిస్ బోబ్డేను సీజేఐగా రెకమెండ్ చేస్తూ జస్టిస్ రంజన్ గొగోయ్ కేంద్రానికి లేఖ రాశారు. సీజేఐగా జస్టిస్ బోబ్డేను అపాయింట్ చేస్తూ ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ సంతకం చేయగా కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అయోధ్యలో భూవివాదం, రైట్ టు ప్రైవసీ వంటి చరిత్రాత్మకమైన తీర్పులను వెలువరించిన బెంచ్ లలో జస్టిస్ బోబ్డే కీలక పాత్ర పోషించారు.
ప్రొఫైల్
- మహారాష్ట్ర లోని నాగ్పూర్ లో 1956 ఏప్రిల్ 24న పుట్టారు
- తండ్రి లాయర్ అరవింద్ శ్రీనివాస్ బోబ్డే
- నాగ్పూర్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ ఎల్ బీ
- 1978లో మహారాష్ట్ర బార్ కౌన్సిల్ లో లాయర్ గా రిజిస్టర్ చేసుకున్నారు
- 21 ఏళ్లపాటు లాయర్ గా సేవలు
- 1998లో సీనియర్ అడ్వకేట్ గా ప్రమోషన్
- 2000 మార్చి 29న బాంబే హైకోర్టు లో అడిషనల్ జడ్జిగా బాధ్యతలు
- 2012 అక్టోబర్ 16న మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా ప్రమాణం
- 2013 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోషన్