- 53వ చీఫ్ జస్టిస్గా పదవిలో 15 నెలలు
- ఆదివారం పదవీ విరమణ చేసిన జస్టిస్ గవాయ్
న్యూఢిల్లీ: భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణం చేయనున్నారు. సుప్రీంకోర్టు ప్రస్తుత చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆదివారం సాయంత్రం పదవీ విరమణ చేశారు. జస్టిస్ సూర్యకాంత్ అక్టోబర్ 30న సీజేఐగా నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో 15 నెలలపాటు కొనసాగనున్నారు. 2027 ఫిబ్రవరి 9న ఆయన రిటైర్ కానున్నారు.
జస్టిస్ సూర్యకాంత్ హర్యానాలోని హిసార్ జిల్లాలో 1962 ఫిబ్రవరి 10న ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. హిసార్లో 1984లో లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఆయన అంచెలంచెలుగా సీజేఐ స్థాయికి ఎదిగారు. సుప్రీంకోర్టు జడ్జిగా తన కెరీర్లో ఆయన చరిత్రాత్మకమైన తీర్పులు ఇచ్చారు. ఆర్టికల్ 370 రద్దు తీర్పును ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్ సభ్యుడిగా ఉన్నారు.
