
హైదరాబాద్ లో కేంద్ర మంత్రి సింధియా జ్యోతిరాదిత్య సింధియా పర్యటన కొనసాగుతోంది. లోక్సభ ప్రవాస్ యోజన (Loksabha Pravas Yojana)లో భాగంగా హైదరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్ సింధియా.. పాతబస్తీలో కార్యకర్తలు, పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ బలోపేతంపై ఆయన చర్చిస్తున్నారు. అందులో భాగంగా పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. పర్యటనకు సంబంధించిన విషయాలను ఆయన సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. శనివారం గౌలిగూడలోని ఉస్మాన్ షాహిలోని శ్రీ జంగిల్ విఠోబా దేవాలయాన్ని సందర్శించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజలు ఆనందంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు ఆయన వెల్లడించారు. బీజేపీ తెలంగాణలోని 7 ఫ్రంట్ ల అధ్యక్ష, కార్యదర్శులతో ఆయన సమావేశమయ్యారు. ఎదుర్కొంటున్న సవాళ్లపై వారితో ఆయన చర్చించారు. త్వరలోనే జరిగే ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి.. సూచనలు, సలహాలు అందచేశారు. చార్మినార్ ప్రాంతానికి చేరుకున్న సింధియా.. కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించారు. మూడో డోస్ తీసుకుంటున్న వారితో ఆయన ముచ్చటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కోవిడ్ వ్యాక్సినేషన్ లు రాష్ట్రాలకు పంపించడం జరుగుతోందని అక్కడున్న వారికి వివరించారు.
వ్యాక్సిన్ లు భారతదేశంలోనే తయారు చేయబడ్డాయన్నారు. అక్కడి నుంచి నేరుగా కార్వాన్ ప్రాంతానికి చేరుకున్నారు. సత్యనారాయణ నగర్ లో యువకులతో నిర్వహించిన సమావేశంలో సింధియా పాల్గొని ప్రసంగించారు. మొదటిసారిగా ఓటు వేయడానికి అర్హులైన యువతను కలుసుకుని వారి కోరికలు, ఆంక్షాంక్షలు తెలుసుకోవడం జరిగిందన్నారు. అనంతరం బీజేపీ విధానాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను వారికి వివరించారు. వరి గింజలపై చిత్రాలు గీసే కళాకారుడిని ఆయన కలుసుకున్నారు. అతని గీసిన చిత్రాలను చూసి మంత్రముగ్ధుడయ్యాయని, భారతీయ కళను సజీవంగా ఉంచుతున్న కళాకారులకు వందనం తెలియచేస్తున్నట్లు తెలిపారు. మలక్ పేట్, చాంద్రాయణగుట్ట, గోషామహాల్, చార్మినార్, కార్వాన్ అసెంబ్లీ పరిధిలో జ్యోతిరాదిత్య సింధియా పర్యటన కొనసాగింది. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సమావేశమయ్యారు. భాగ్యలక్ష్మీ అమ్మవారిని సింధియా దర్శించుకున్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగింది.
चावल के दाने पर चित्रकारी के लिए प्रख्यात कलाकार श्री पन्ना माहेश्वरी जी की अत्यंत बारीक चित्रकारी से मंत्रमुग्ध रह गया। भारतीय कला को सजीव रखने वाले ऐसे मूर्धन्य कलाकारों को सलाम। pic.twitter.com/YFZGPGt7iG
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) July 30, 2022
न्यू सत्यनारायण नगर, करवान में पहली बार मतदान देने के योग्य युवाओं से मिला और उनकी इच्छा और आकाँक्षाओं के बारे में जाना। अपने प्रतिनिधि के चयन के विषय में उनकी स्पष्टता, भारत के मज़बूत लोकतंत्र का परिचायक है। उनका उत्साह, एक नई ऊर्जा का संचार करता है। @BJP4Telangana pic.twitter.com/y2p5AdLz2E
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) July 30, 2022
चारमीनार क्षेत्र में कोविड टीकाकरण केंद्र में तृतीय डोज़ के लाभार्थियों से बातचीत की। जहाँ पहले भारत टीके आयात करता था, वहीं प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में विश्व के लिए भारत में कोविड के 2-2 टीकों का निर्माण हुआ है। pic.twitter.com/zT5x6hrIqz
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) July 30, 2022
आज भाजपा तेलंगाना के 7 मोर्चों के अध्यक्षों एवं महासचिवों से मिलने का अवसर मिला और राज्य इकाई के सामने आ रही चुनौतियों पर चर्चा की। इस दौरान राज्य में आगामी विधानसभा चुनावों की तैयारियों पर भी विस्तारपूर्वक चर्चा हुई। @BJP4Telangana pic.twitter.com/2JpaVrnnlr
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) July 30, 2022
हैदराबाद के उस्मानशाही, गौलीगुड़ा में मुचकुन्द नदी पर बसे श्री जंगल विठोबा देवस्थानम में भगवान विट्ठल की पूजा-अर्चना की और देश की सुख-समृद्धि के लिए प्रार्थना की। pic.twitter.com/yteW6OrlTq
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) July 30, 2022