ముషీరాబాద్, వెలుగు: నిత్యం ప్రజల్లో ఉంటూ సేవాకార్యక్రమాలు చేస్తూ రాజకీయాలు చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ సూచించారు. ఆదివారం చిక్కడపల్లిలో వీబీఫౌండేషన్ చైర్మన్ బండారు విజయలక్ష్మితో కలిసి రాజ్యసభ సభ్యడు లక్ష్మణ్ మహిళలకు కుట్టు మెషీన్లను పంపిణీ చేసి మాట్లాడారు.
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి స్వచ్ఛంద సంస్థల ద్వారా ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి పొందే విధంగా వారికి తోడ్పాటు అందించాలన్నారు. అప్పుడే సమాజంలో మహిళలు అభివృద్ధి చెంది బాగుపడతారన్నారు. త్వరలోనే ప్రధాని మోదీ మహిళలకు శుభవార్త చెబుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పావని, రచన శ్రీ, సుప్రియ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు పూసరాజు, బీజేపీ నేతలు నరేశ్, రత్న సాయిచంద్, కలకోట అరుణ్ కుమార్, బద్రినారాయణ పాల్గొన్నారు.