50 వేల కోట్ల స్కాంపై సీబీఐకి ఫిర్యాదు

50 వేల కోట్ల స్కాంపై సీబీఐకి ఫిర్యాదు
  • కాళేశ్వరం అవినీతిపై  సమగ్ర విచారణ చేపట్టండి
  • సీఎం రేవంత్ ఎందుకు సైలెంట్​గా ఉన్నరు
  • ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్​చేశారు. ప్రజాశాంతి పార్టీ, గ్లోబల్ పీస్ ఆధ్వర్యంలో కోఠిలోని సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. కాగ్ రిపోర్టు ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో 50 వేల కోట్ల అవినీతి జరిగిందని వెల్లడించినట్లు వివరించారు. హైకోర్టులో ఈ నివేదిక ఉన్నప్పటికీ సీబీఐ విచారణకు ఆదేశించలేదని అన్నారు. ఎన్నికల సమయంలో కాళేశ్వరం స్కాంపై ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నారని అన్నారు. దీనిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ కు ముఖ్యమంత్రి లేఖ రాయాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బట్టబయలయ్యే వరకు తాను పోరాటం చేస్తామన్నారు.