హైకోర్టు సీజేను కేసీఆర్​ కలవడం అభ్యంతరకరం : కేఏ పాల్

హైకోర్టు సీజేను కేసీఆర్​ కలవడం అభ్యంతరకరం : కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు సీజేను సీఎం కేసీఆర్​ కలవడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ రిట్​ పిటిషన్​ విచారణకు రానున్న తరుణంలో సీఎం కేసీఆర్​, హైకోర్టు సీజేను కలవడం అసహజ పరిణామమని పాల్​ వ్యాఖ్యానించారు.  దీనిపై సుప్రీంకోర్టు సీజేఐకి  లేఖ రాసినట్లు వెల్లడించారు. తనకు దాదాపు 120 మంది మేధావుల మద్దతు ఉందన్నారు.

ఈ వ్యవహారంపై తాను సిద్ధం చేసిన పిటిషన్​ పై ఇప్పటికే దాదాపు 78వేల మంది సంతకం చేశారని తెలిపారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సమయంలోనూ సీఎం కేసీఆర్​.. అప్పటి చీఫ్ జస్టిస్ ను కలవడం వివాదాస్పదమైందన్నారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన ప్రెస్​ మీట్​ లో  కేఏపాల్ ఈ కామెంట్స్​ చేశారు.