ఇవాళ(సెప్టెంబర్ 24) కాచిగూడ-బెంగళూరు వందే భారత్

ఇవాళ(సెప్టెంబర్ 24) కాచిగూడ-బెంగళూరు వందే భారత్
  •     వర్చువల్​గా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ

సికింద్రాబాద్, వెలుగు : తెలంగాణ నుంచి  కర్నాటకకు వెళ్లే  కాచిగూడ– యశ్వంత్​పూర్(610కిమీ) వందే భారత్ ఎక్స్ ప్రెస్​ను  ప్రధాని మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా   ప్రారంభించనున్నారు. ఇందుకోసం కాచిగూడ రైల్వేస్టేషన్​లో  రైల్వే అధికారులు ఉదయం 10.30కు ప్రత్యేక కార్యక్రమాన్ని  ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రామ్ లో  గవర్నర్​ తమిళిసై​, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి పాల్గొననున్నారు. అనంతరం రైలు కాచిగూడ నుంచి బయలుదేరి యశ్వంత్ పూర్​ వెళుతుంది.  తిరిగి ఈ నెల25న యశ్వంత్‌‌పూర్​​లో మధ్యాహ్నం 2.45కు బయలుదేరి కాచిగూడకు రాత్రి 11.15కు  చేరుకుంటుంది. –

ఇది  తెలంగాణ(హైదరాబాద్), ఏపీ, కర్నాటక(బెంగళూరు)లను కలుపే మొదటి వందే భారత్ రైలు కావడం విశేషం. రైలు మార్గమధ్యలో మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. బుధవారం మినహా వారంలో 6 రోజులు సర్వీసులో ఉంటుంది. కాచిగూడ నుంచి యశ్వంత్ పురాకు ఏసీ చార్జీని రూ. 1600గా.. ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ. 2,915గా నిర్ణయించారు.