కాంగ్రెస్ లోకి కడియం శ్రీహరి...

కాంగ్రెస్ లోకి కడియం శ్రీహరి...

బీఆర్ఎస్ అధినేత కీసీఆర్ కి షాక్ మీద షాక్ తగులుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు కాంగ్రెస్, బీజేపీ పార్టీల తీర్థం పుచ్చుకోగా తాజాగా మరొక కీలక నేత కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరారు. తన కూతురు కడియం కావ్యతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కడియం నిన్నటిదాకా బీఆర్ఎస్ లో కీలక పాత్ర పోషించారు.

కూతురుతో కలిసి ఢిల్లీ బయల్దేరిన కడియం ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శాలువా కప్పి సన్మానించిన కడియంను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపదాస్ మున్షి. నిజానికి సోనియా ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరాల్సిన కడియం, అపాయింట్మెంట్ కుదరని కారణంగా దీపాదాస్ సమక్షంలో పార్టీలో చేరారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కడియం శ్రీహరి, కావ్యల చేరికతో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని అన్నారు దీపాదాస్ మున్షి. వరంగల్ స్థానం నుండి కావ్యకు ఎంపీ టికెట్ ఆశిస్తున్నప్పటికీ ఆ సీటు కడియం శ్రీహరికే ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.