- కౌన్సిల్లో ఖాళీ అయిన ఆరు స్థానాలు
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ పదవులకు కడి యం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి రాజీనామా చేశారు. శనివారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి రాజీనామా లేఖలు అందజేశారు. కడియం, కౌశిక్రెడ్డి ఎమ్మెల్యే కోటాలో, పల్లా రాజేశ్వర్రెడ్డి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ఘన్పూర్ నుంచి కడియం, జనగామ నుంచి పల్లా, హుజూరాబాద్ నుంచి కౌశిక్రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవులకు వారు రిజైన్ చేశారు. వారి రాజీనామాలను చైర్మన్ ఆమోదించారు. కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇప్పటికే రాజీనామా చేశారు. దీంతో కౌన్సిల్లో 4 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినట్టు సెంట్రల్ఎలక్షన్ కమిషన్కు సమాచారం ఇచ్చారు. గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇప్పటికే ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు నలుగురు రాజీనామా చేయడంతో కౌన్సిల్లో మొత్తం ఆరు స్థానాలు ఖాళీ అయ్యాయి.