ఉప్పల్, వెలుగు: ఓయూ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ‘కైరోస్-2026’ పేరిట లిటరేచర్ఫెస్టివల్ గురువారం ప్రారంభమైంది. ఆర్ట్స్ కాలేజీలో జరిగిన ఈ వేడుకను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని, క్లాస్ రూమ్ల నుంచే దేశ భవిష్యత్తు నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు.
కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి. కాసీం మాట్లాడుతూ.. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు దోహదపడతాయని, అన్ని విభాగాలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఫెస్టివల్లో భాగంగా సాహిత్య క్విజ్, కవితా వాచనం, స్పెల్ బీ, మీమ్ సృష్టి వంటి వినూత్న పోటీలు నిర్వహించారు. విజేతలకు ముగింపు వేడుకలో బహుమతులు అందజేయనున్నారు

