సోషల్ మీడియాకు కాజోల్ బ్రేక్.. నిజమేనా, ప్రమోషనల్ స్ట్రాటజీనా

సోషల్ మీడియాకు కాజోల్ బ్రేక్.. నిజమేనా, ప్రమోషనల్ స్ట్రాటజీనా

బాలీవుడ్ నటి కాజోల్ సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లోని అన్ని పోస్టులను తొలగించింది. దాంతో పాటు తన జీవితంలో అత్యంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్నట్టు రాసుకొచ్చింది. కాజోల్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం అందర్నీ షాక్ కు గురి చేసింది. అసలేమైందో తెలియక ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాజోల్ చేసిన ఈ తాజా పోస్టుతో సినీ ప్రేక్షకులు, నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఎందుకు ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు అని కొందరు ప్రశ్నించగా, మరికొందరు కాజోల్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కొన్నిసార్లు ఇది కూడా మంచిదే. కాబట్టి  మీకు మంచి ఆరోగ్యం, జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కునే సంకల్ప బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని ఇంకొందరు కామెంట్ చేశారు. టేక్ యూర్ టైమ్ క్వీన్, అక్కడ మీరు బాగానే ఉన్నారని ఆశిస్తున్నానంటూ కొందరు ఫ్యాన్స్ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మరికొందరేమో దీన్ని ప్రమోషనల్ స్ట్రాటజీగా పేర్కొన్నారు. ఇది కాజోల్ రాబోయే ఓటీటీ సిరీస్ ది గుడ్ వైఫ్ కోసం ప్రచార వ్యూహమని కామెంట్ చేశారు. ఈ చిత్రంలో ఆమె ద్విపాత్రాభినయం చేసింది.

కాజోల్ రాబోయే సినిమాలు

కాజోల్ సినిమాల విషయానికొస్తే ఆంథాలజీ లస్ట్ స్టోరీస్ 2లో కనిపించనుంది. దీనికి నలుగురు దర్శకులు - అమిత్ రవీందర్నాథ్ శర్మ, ఆర్. బాల్కీ, కొంకణా సేన్ శర్మ, సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. ఇందులో అమృతా శుభాష్, అంగద్ బేడి, విజయ్ వర్మ, కుముద్ మిశ్రా, మృణాల్ ఠాకూర్, నీనా గుప్తా, తిలోటమా షోమ్ కూడా నటించనున్నారు.