కాళీమాత ఆలయంలో చోరీ..హుండీ పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లిన దుండగులు

కాళీమాత ఆలయంలో చోరీ..హుండీ పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లిన దుండగులు

శంకర్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: ఆలయంలో హుండీ పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లిన ఘటన సోమవారం రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లిలో జరిగింది. శంకర్‌‌‌‌‌‌‌‌పల్లి డీఐ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపురం కాళీమాత దేవాలయంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. గుడిలోని హుండీని పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. 

హుండీని మూడు నెలల నుంచి తెరవలేదని ఆలయ పూజారి నరేశ్​శర్మ తెలిపారు. అక్కడి సీసీ కెమెరాలు కొద్దికాలంగా పనిచేయకపోవడంతో రెండ్రోజుల క్రితమే వాటిని తొలగించి, కొత్తవాటిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పూజారి పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఐ తెలిపారు.