
ఏసీబీ అధికారులు ఎన్ని దాడులు చేస్తున్నా అధికారుల తీరు మారటం లేదు. లంచగొండుల భరతం పట్టాల్సిన పోలీసులే లంచం తీసుకుంటూ దొరికిపోవటం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం (జూన్ 25) భూ వివాదంలో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 20 వేలు లంచం తీసుకుంటూ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎస్సై ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపాయారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న రెండో ఎస్సై రామచందర్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. కల్వకుర్తి మండలం గుండూరు గ్రామానికి చెందిన నబీ వెంకటయ్య భూవివాదంలో స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి 20 వేల రూపాయలు డిమాండ్ చేశారు. చివరికి 10 వేల రూపాయలకు ఒప్పందం చేసుకున్నారు.
►ALSO READ | మెట్ పల్లి వాసులకు గుడ్ న్యూస్.. మన మెట్ పల్లి యాప్ ప్రారంభం
అయితే ఎస్సై తీరుపై ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బాధితుడు వెంకటయ్య. అధికారులు చెప్పినట్లుగా ఒప్పందం ప్రకారం10 వేల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. వెంకటయ్య నుంచి ఎస్సై రాంచందర్ పది వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.