
కమల్ హాసన్ హీరోగా మణిరత్నం రూపొందించిన చిత్రం ‘థగ్ లైఫ్’. శింబు కీలక పాత్ర పోషించగా త్రిష, అభిరామి హీరోయిన్స్. జూన్ 5న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. ఫస్ట్ సాంగ్ను రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. శనివారం ట్రైలర్ను విడుదల చేశారు. మణిరత్నం తనదైన క్లాస్ టచ్తో కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు దీని ద్వారా తెలుస్తోంది.
ఓ నాయకుడు, అతను పెంచుకునే వారసుడు.. ప్రత్యర్థులు ఆ పవర్ను లాక్కోవడానికి చేసే ప్రయత్నాలు.. వీటన్నింటినీ చూపిస్తూ ఆసక్తిని కలిగించేలా ట్రైలర్ను కట్ చేశారు. ఇందులో కమల్ హాసన్ డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తూ ఇంప్రెస్ చేస్తున్నారు. శింబు సాలిడ్ రోల్లో చేసినట్టుగా అర్ధమవుతోంది. ‘ఇది యముడికి నాకు జరిగే కథ.. నువ్వా నేనా’ అని కమల్ హాసన్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.
అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, మహేష్ మంజ్రేకర్, అలీ ఫజల్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, అభిరామి వంటి స్టార్స్ ను చూపిస్తూ సాగిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ హైలైట్గా నిలిచింది. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ రిలీజ్ చేస్తోంది.