ఇద్దరు అధికారులకు హైకోర్టు జైలుశిక్ష

ఇద్దరు అధికారులకు హైకోర్టు జైలుశిక్ష

మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. గజ్వేల్‌ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, కొండపాక తహసీల్దార్‌ ప్రభుకు రెండు నెలల జైలు శిక్ష విధించింది కోర్టు. ఇద్దరికీ చెరో రూ. 2 వేల జరిమానా కూడా విధించింది. పరిహారం చెల్లించకుండా ప్రాజెక్టు పనులు చేపట్టి కోర్టు తీర్పు దిక్కరించారని శిక్ష విధించింది కోర్టు.