హుజూరాబాద్ లో ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినా.. పోలింగ్ మాత్రం ఎక్కడా ఆగలేదు. అయితే ఈ ఉపఎన్నిక కోసం పార్టీలు మాత్రం భారీగా డబ్బులు ఖర్చుచేస్తున్నాయి. కమలాపురం మండలము గూడూరు సర్పంచు ఎవరెవరికీ డబ్బులు ఇవ్వాలో వారిని లిస్టుగా తయారుచేసి మరీ డబ్బులు పంచుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మరో వైపు జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో టీఆర్ఎస్ సర్పంచ్ ఇంటి ముందు ఓటర్లు బారులు తీరారు. ఓటేయడానికి వచ్చిన వారికి డబ్బులు ఇస్తుండటంతో ఆయన ఇంటి గేటు ముందు ప్రజలు భారీ సంఖ్యలో నిలుచున్నారు.