బండి సంజయ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

 బండి సంజయ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • కామారెడ్డి జిల్లా బికనూర్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • బాసర వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
  • బాసర విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా .. బయలుదేరిన బండి సంజయ్
  • పోలీసులతో బీజేపీ కార్యకర్తలు, మహిళల వాగ్వాదం


కామారెడ్డి జిల్లా: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాసరలో ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనకు మద్దతు ప్రకటించిన ఆయన.. ఇవాళ విద్యార్థులను కలసి సంఘీభావం తెలియజేయనున్నట్లు ప్రకటించారు. చెప్పినట్లే హైదరాబాద్ నుండి బాసరకు బయలుదేరారు బండి సంజయ్. పలుచోట్ల నిలువరించే ప్రయత్నం చేసినా.. స్థానిక బీజేపీ నేతల ప్రతిఘటనతో వదిలేశారు. అయితే కొద్దిసేపటి క్రితం కామారెడ్డి జిల్లా బికనూరు వద్ద రోడ్డుపై మొహరించిన పోలీసులు 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వాహనాన్ని నిలిపేశారు. పోలీసులతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులతో వాగ్వాదం చేస్తున్నా.. పట్టించుకోకుండా భారీ సంఖ్యల పోలీసులతో బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు  తమ వాహనంలో ఎక్కించకుని వెళ్లిపోయారు. ఈ సందర్భంగా వాగ్వాదాలతో బికనూర్ వద్ద జాతీయ రహదారి వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.