
కామారెడ్డి టౌన్, భిక్కనూరు, వెలుగు: రైతు బంధు పథకాన్ని ఆపాలంటూ కాంగ్రెస్ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ గురువారం కామారెడ్డిలో, భిక్కనూరు మండలంలోనూ రామేశ్వరపల్లి, బస్వాపూర్, కాచాపూర్తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లాకేంద్రంలో జరిగిన నిరసనలో టౌన్ ప్రెసిడెంట్జూకంటి ప్రభాకర్రెడ్డి, యూత్ వింగ్ ప్రెసిడెంట్ చెలిమెల భాను మాట్లాడుతూ.. పేదలకు లబ్ధి చేకూరుతుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. కార్యక్రమంలో భిక్కనూరు ఎంపీపీ గాల్రెడ్డి, జడ్పీటీసీ పద్మ నాగభూషణంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.