కాంగ్రెస్ లో చేరిన కంచనపల్లి ఎంపీటీసీ కెమిడి రమ్యరాజు

కాంగ్రెస్ లో చేరిన కంచనపల్లి ఎంపీటీసీ కెమిడి రమ్యరాజు

రఘునాథపల్లి ,వెలుగు: రఘునాథపల్లి మండలంలోని కంచనలపల్లి కి   చెందిన బీఆర్​ఎస్​ ఎంపీటీసీ కెమిడి రమ్యరాజుతో పాటు కుర్మ  కులానికి చెందిన 50 మంది  సభ్యలు శుక్రవారం కాంగ్రెస్  నియోజకవర్గ  ఇన్​చార్జి సింగపురం ఇందిరా సమక్షంలో   ఆ పార్టీలో చేరారు.  

కార్యక్రమంలో ఎంపీపీ మేకల వరలక్ష్మి నరేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీశ్​ చందర్ రెడ్డి , జిల్లా నాయకుడు మేకల నరేందర్  పాల్గొన్నారు.