అనుమానాస్పద రీతిలో కన్నాలక్ష్మీనారాయణ కోడలు మృతి

అనుమానాస్పద రీతిలో కన్నాలక్ష్మీనారాయణ కోడలు మృతి

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్న కుమారుడు ఫణేంద్ర భార్య సుహారిక అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. మాదాపూర్ మీనాక్షి టవర్స్ లో స్నేహితురాలి ఇంటికి వెళ్లిన సుహారిక కుప్పకూలినట్లు తెలుస్తోంది. దీంతో అత్యవసర చికిత్స కోసం రాయదుర్గం ఏఐజి ఆస్పత్రికి తరలించగా..ఆమె అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.

కాగా సుహారిక మరణంపై రాయదుర్గం సీఐ స్పందించారు. మీనాక్షి విల్లా లో సుహారికతో పాటు కొంత మంది బంధువులు, స్నేహితులు పార్టీ చేసుకున్నారని అన్నారు.  పార్టీలో కొద్ది సేపు డాన్స్ చేసిన సుహారిక..ఉదయం 11:30 ఒక్క సారిగా కుప్పకూలడంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు, స్నేహితులు ఏఐజీ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పిన రాయదుర్గం సీఐ మీడియాకు వివరించారు.  అయితే ఓ మహిళ చనిపోయిందని  తమకు సమాచారం అందడంతో ఆస్పత్రికి వెళ్లి విచారణ చేపట్టామన్నారు. విచారణలో కుటుంబ సభ్యులు, స్నేహితుల స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశామని.. బాధితురాలి తల్లి, భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు  తెలిపారు.   పోస్ట్ మార్టం నిమిత్తం సుహారిక డెడ్ బాడీని  ఉస్మానియా ఆసుపత్రి కి తరలిస్తామన్న రాయదుర్గం సీఐ రవీందర్ ..పోస్ట్ మార్టం తరువాత  మరణంపై గురించి క్లారిటీ వస్తుందని చెప్పారు.