ఎంపీ వంశీకృష్ణ కృషితో రామగుండంలో కాన్పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- మధురై రైలుకు హాల్టింగ్

ఎంపీ వంశీకృష్ణ కృషితో  రామగుండంలో కాన్పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- మధురై రైలుకు హాల్టింగ్

గోదావరిఖని, వెలుగు: కాన్పూర్​ నుంచి మధురై వరకు నడిచే సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాస్ట్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌ (రైలు నంబర్​ 01925/01926) గురువారం నుంచి రామగుండం రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ఆగనుంది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషితో ఈ రైలుకు హాల్టింగ్ కల్పిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నది. కాన్పూర్​ నుంచి మధురైకి ప్రారంభమైన ఈ రైలును రామగుండంలో నిలుపుదల చేయాలని ఎంపీ వంశీకృష్ణ కేంద్ర రైల్వే శాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్​తో పాటు రైల్వే బోర్డు చైర్మన్ సతీశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మాట్లాడారు. 

కాగా ఈ రైలు రామగుండంలో గురువారం తెల్లవారుజామున 5.20 గంటలకు రానుండగా, తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్లే వారికి ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ఎంపీకి దక్షిణమధ్య రైల్వే యూజర్స్​ కమిటీ మెంబర్​ అనుమాస శ్రీనివాస్​ కృతజ్ఞతలు తెలిపారు.