కేజీఎఫ్ 2 తర్వాత రికార్డు స్థాయిలో కాంతార కలెక్షన్లు

కేజీఎఫ్ 2 తర్వాత రికార్డు స్థాయిలో కాంతార కలెక్షన్లు

కన్నడలో ఈ మధ్య కాలంలో విడుదలైన కాంతార మూవీ కలెక్షన్లలో దూసుకెళ్తోంది. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కాంతార మూవీ.. దీపావళి పండగ వారాంతం తర్వాత దేశంలో రూ. 170 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ లో రూ.18 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.188 కోట్లు సాధించింది. యష్ నటించిన కేజీఎఫ్ 2 తర్వాత.. అంతటి స్థాయిలో అత్యధిక వసూళ్లు రాబడుతున్న కన్నడ చిత్రంగా.. కాంతార రెండవ స్థానంలో నిలిచింది. 

ఇదిలా ఉంటే.. కాంతార మూవీలోని ఓ పాట వివాదానికి దారి తీసింది. ఈ సినిమాకి ఎంతో పేరుతెచ్చిన వరాహ రూపం.. పాటను కాపీ చేశారంటూ చిత్ర బృందంపై.. కేరళలోని థాయికుడమ్ బ్రిడ్జ్ అనే సంగీత బృందం ఆరోపణలు చేసింది. తమ బృందానికి చెందిన నవరసం అనే పాటను పోలి ఉందని.. తమ అనుమతి లేకుండా ఈ పాటను కాపీ చేశారంటూ ఆరోపించారు. కాంతార టీమ్ కు చట్టపరంగా నోటీసులు పంపుతామని హెచ్చరించారు. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి.. దర్శకత్వం వహించిన కాంతార సినిమా.. కర్ణాటకలోని తుళునాడులో ఉన్న ఆచార, సంప్రదాయాల్ని చక్కగా చూపించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేసింది. రిషబ్ శెట్టి నటించిన విధానం ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇక వరాహ రూపం పాట వివాదం పై చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తో చూడాలి.