ముచ్చింతల్ లో స్కూల్ ప్రారంభించిన కపిల్​దేవ్

ముచ్చింతల్ లో స్కూల్ ప్రారంభించిన కపిల్​దేవ్
  •  రూ.3 కోట్లతో నిర్మించి  ఇచ్చిన మై హోమ్ గ్రూప్ 

శంషాబాద్, వెలుగు:  ముచ్చింతల్ లో రూ.3 కోట్లకుపైగా ఖర్చుతో మై హోమ్ గ్రూప్ కట్టించిన స్కూల్ బిల్డింగ్ ను మంగళవారం మాజీ క్రికెటర్ కపిల్​దేవ్​ప్రారంభించారు. అనంతరం కపిల్ దేవ్ మాట్లాడుతూ.. మనిషి, సమాజ అభివృద్ధికి విద్య ఎంతో ముఖ్యమని.. టీచర్లు చెప్పినట్లు మంచిగా చదువుకొని గొప్పగా స్థానాలు చేరుకోవాలని స్టూడెంట్లకు సూచించారు. కార్యక్రమంలో మై హోం సంస్థ మేనేజ్​మెంట్ జగపతిరావు, సర్పంచ్ సుజాత చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.