పోలింగ్ రోజు మంత్రి రూల్స్ బ్రేక్ చేశారు

పోలింగ్ రోజు మంత్రి రూల్స్ బ్రేక్ చేశారు

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజు మంత్రి గంగుల కమలాకర్ రూల్స్ బ్రేక్ చేశారని కరీంనగర్ మాజీ మేయర్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి రవీందర్ సింగ్ అన్నారు. ఓటు వేసేందుకు మంత్రితో పాటు వచ్చిన వారేవరినీ అధికారులు చెక్ చేయకుండా లోపలికి పంపారన్నారు. రూల్స్ ఉల్లంఘనపై సీపీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్లను.. మంత్రి గంగుల, ఎమ్మెల్యేలు భయపెట్టారని చెప్పారు. టీఆర్‌‌ఎస్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా నైతిక విజయం తనదేనన్నారు రవీందర్ సింగ్.