
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై విజయం సాధించారు. షిగ్గావ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్ పై 20,000 ఓట్లకు పైగా గెలుపొందారు. బొమ్మైకి 59,242 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి పఠాన్కు 37,723 ఓట్లు వచ్చాయి. ఇది ఆయనకు వరుసగా నాలుగోసారి విజయం కావడం విశేషం. ఇక జేడీఎస్ కు చెందిన శశిధర్ యెలిగర్ మూడో స్థానంలో నిలిచారు.