కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. దాన్ని ఎదుర్కొనేందుకు పలువురు ప్రముఖులు ప్రతిరోజు తమ విరాళాలను ప్రకటిస్తున్నారు. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కూడా తన వంతు విరాళాన్ని ప్రకటించారు. కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తన వంతు బాధ్యతగా తన సంవత్సర కాలపు జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండుకు పంపిస్తున్నట్లు ఆయన బుధవారం ప్రకటించారు.
కరోనా మహమ్మారిపై పోరాడటంలో రాష్ట్ర పౌరులు తమ వంతు సాయంగా ఎంతోకొంత విరాళంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. విరాళాలు ఇవ్వాలనుకున్నవాళ్లు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండుకు పంపించాలని ఆయన సూచించారు.
For More News..