ప్రభుత్వానికి కళ్లు, చెవులు, హృదయం లేవు

ప్రభుత్వానికి కళ్లు, చెవులు, హృదయం లేవు

కర్ణాటకలో భారీ ట్రాక్టర్‌‌ ర్యాలీ నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. వేలాది మంది కార్యకర్తలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిరసన ప్రదర్శన చేపట్టింది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌‌ల నాయకత్వంలో బెళగావిలోని అసెంబ్లీ ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో వారిని పోలీసులు అడ్డగించి, అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. బసవరాజ్ బొమ్మై నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కమిషన్ల కోసమే పనిచేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రతీ పనిలోనూ 40 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు. తాము చట్ట వ్యతిరేక పనులు చేయబోమని, తాము కేవలం  అసెంబ్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నామని పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. ఈ ప్రభుత్వానికి చెవులు, కళ్లు, హృదయం అనేవి లేవని అన్నారు. ప్రభుత్వం పూర్తిగా నిర్జీవంగా మారిపోయిందన్నారు.