జాబ్ మేళాతో యువతకు ఉపాధి

జాబ్ మేళాతో యువతకు ఉపాధి
  • టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేశ్

పరిగి,వెలుగు: మెగా జాబ్ మేళాతో నిరుద్యోగ యువతకు ఉపాధి కలుగుతుందని కాసాని ఫౌండేషన్ చైర్మన్, టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేశ్ ముదిరాజ్ అన్నారు. శనివారం పరిగి పట్టణంలోని కొప్పుల శారద గార్డెన్స్ లో నిరుద్యోగ యువత కోసం కాసాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు.ఈ మేళాలో100 కంపెనీలు పాల్గొన్నాయి. 

 మొత్తం 1,600 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోగా.. 782  మందికి ఉద్యోగాలు వచ్చినట్లు కాసాని వీరేశ్ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ సాంస్కృతిక కళా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రహాస్, నేతలు మాణిక్యం బాబు, శ్రీశైలం, బాల ముకుందం, విజయ భాస్కర్ గౌడ్, మాసయ్య తదితరులు పాల్గొన్నారు.