రిజైన్ చేయాలంటూ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి యువకుడి ఫోన్

రిజైన్ చేయాలంటూ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి యువకుడి ఫోన్

మెదక్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి ఓ యువకుడు కాల్ చేసి షాకిచ్చాడు. రామయంపేట మండలం కాట్రియాల్ గ్రామానికి చెందిన ఓ యువకుడు పద్మా దేవేందర్ రెడ్డికి ఫోన్ చేసి రిజైన్ చేయాలని కోరాడు.   మునుగోడులో పార్టీ పరిస్థితి ఏంటని అడిగాడు యువకుడు. గెలుస్తాం.. పార్టీ పరిస్థితి బానే ఉందని  ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి యువకునితో  చెప్పారు. కానీ ఇంతలోనే మేడమ్ మీరు కూడా రాజీనామా చేస్తే బాగుంటుంది..మా ఊరు అభివృద్ధి చెందుతుందని అడిగాడు .  వెంటనే ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కాల్ కట్ చేశారు. ప్రస్తుతం  ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై పద్మాదేవేందర్ రెడ్డి బీజేపీపై విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై  బీజేపీ కుట్ర చేస్తుందంటూ మెదక్ జిల్లా వ్యాప్తంగా నిన్న(గురువారం) బీజేపీ,  మోడీ, అమిత్ షాల దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు. పద్మాదేవేందర్ రెడ్డి  ప్రస్తుతం మెదక్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలిగా అన్నారు.