
ట్యాంక్ బండ్, వెలుగు: జీహెచ్ఎంసీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం లోయర్ ట్యాంక్ బండ్ లోని కట్ట మైసమ్మ దేవాలయం వద్ద బోనాల వేడుకలు నిర్వహించారు. వేడుకలకు ఎమ్మెల్సీ కోదండరాం, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతశోభన్ రెడ్డి హాజరై మొక్కలు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ కన్వీనర్ ఆకుల శ్రీనివాస్, టీజేఎస్ నగర అధ్యక్షుడు ఎం.నరసయ్య, మెరుగు శ్రీనివాస్ యాదవ్, లక్ష్మి, పల్లె వినయ్, సలీం తదితరులు పాల్గొన్నారు.