కాతూరు పీఏసీఎస్ ఆఫీసుకు తాళం.. పెండింగ్ బిల్లులు చెల్లించాలని రైతులు డిమాండ్

కాతూరు పీఏసీఎస్ ఆఫీసుకు తాళం.. పెండింగ్ బిల్లులు చెల్లించాలని రైతులు డిమాండ్

అలంపూర్, వెలుగు: పెండింగ్​లో ఉన్న బిల్లులు చెల్లించాలని డిమాండ్​ చేస్తూ అలంపూర్ పరిధిలోని క్యాతూరు వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం(పీఏసీఎస్) కార్యాలయానికి రైతులు బుధవారం తాళం వేశారు. గతేడాది డిసెంబర్‌‌‌‌లో గద్వాల జిల్లాలో తెలంగాణ మార్క్‌‌‌‌ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్నలు కొనుగోలు చేశారు. 306 మంది రైతులకు సంబంధించిన రూ.4 కోట్ల 3 లక్షల 98 వేల 58 చెల్లించాల్సి ఉంది. కొనుగోలు జరిగి రెండు నెలలు గడిచినా డబ్బులు రాకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీఎస్ కార్యదర్శిని కార్యాలయంలో ఉంచి తాళం వేసి ఆందోళన చేపట్టారు.