బూత్ స్థాయిలో పార్టీ పటిష్టతకు చర్యలు : కవిత

బూత్ స్థాయిలో పార్టీ పటిష్టతకు చర్యలు : కవిత

ఆమనగల్లు, వెలుగు: బూత్ స్థాయిలో కాంగ్రెస్ పటిష్టతకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని  పార్టీ పర్యవేక్షకులు కవిత సూచించారు. సోమవారం కడ్తాల్ మండల కేంద్రంలో కల్వకుర్తి నియోజకవర్గ పార్టీ బూత్ స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ కార్యకర్తల కృషితోనే పార్టీ విజయం సాధ్యమన్నారు. ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకుపోయి విజయానికి కృషి చేయాలన్నారు.

శిబిరంలో  కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్,  నాయకులు రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మైసిగండి మైసమ్మ ఆలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాలలో  నాయకులు పాల్గొన్నారు.