కేసీఆర్ బర్త్ డే రోజైనా నిరుద్యోగులను గుర్తు తెచ్చుకో

కేసీఆర్ బర్త్ డే రోజైనా నిరుద్యోగులను గుర్తు తెచ్చుకో

హైదరాబాద్: నిరుద్యోగుల బలిదానాలతో సాధించిన తెలంగాణలో ఉద్యోగాలు లేక.. రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం తన పుట్టిన రోజు సందర్భంగానైనా నోటిఫికేషన్స్ ఇవ్వాలని ఆయన సూచించారు. మంగళవారం ఉదయం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి నియామకాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలలో చురుగ్గా లేని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దగ్గరకు రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం బలమైన సంకేతాలు ఇచ్చేందుకే రేవంత్ రెడ్డి స్వయంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిసినట్లు తెలుస్తోంది. 

ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ ధనిక రాష్ట్రమన్న సీఎం ధాన్యం కొనలేడా అని ప్రశ్నించారు. తెలంగాణలో కేవలం మూడు నియోజవర్గాలే రాష్ట్రమా? అని నిలదీశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకడుగువేయక తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకుంటామన్నారు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ కు నోటిఫికేషన్లు గుర్తుకొస్తాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ వ్యతిరేకి అయిన ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మూడు డీఎస్సీలు ప్రకటించాడని.. అదే ప్రత్యేక తెలంగాణకు సీఎం అయిన కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. కనీసం తన పుట్టిన రోజునాడైనా కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. 

 

 

 

ఇవి కూడా చదవండి

వైఎస్ షర్మిల అరెస్టు

దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ దోషి

కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎప్పటికీ కలిసే ప్రసక్తి లేదు