కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటోంది

కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటోంది

బంగారు తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం బాగుపడటమేనా అని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ప్రశ్నించారు. నిరుద్యోగ నిరసన దీక్షలో పాల్గొన్న ఆయన.. తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన విద్యార్థులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్, యువరాజు, యువరాణి ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణను దోచుకుంటున్న కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ పార్టీనే బంగారు తెలంగాణకు అడ్డంకి అని చుగ్ ఆరోపించారు. స్వరాష్ట్రం కోసం పోరాడిన వారంతా ఇప్పుడు కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాడుతున్నారని విమర్శించారు. బంగారు తెలంగాణ కలను సాకారం చేసే ప్రభుత్వం అసెంబ్లీలో అడుగుపెట్టే వరకు బీజేపీలో చేరికలు ఆగవని అన్నారు .తెలంగాణ అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు వచ్చే వరకు బీజేపీ ప్రజాస్వామ్యయుత పోరాటం కొనసాగుతుందని చుగ్ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం..

 

కేసీఆర్ మొగోడైతే ప్రభుత్వాన్ని రద్దు చేయాలె

రాష్ట్ర సంపద ప్రజలకు చెందాలి.. కేసీఆర్ కుటుంబానికి కాదు