తెలంగాణ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నకేసీఆర్

తెలంగాణ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నకేసీఆర్

ఈ నెల 11 వ తేదీ నాటికి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు సీఎం కేసీఆర్ అటెండ్ కావాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. లేదంటే తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతాని హెచ్చరించారు. కేసీఆర్ ఫాం హౌస్ లో ఉంటడు… ప్రగతి భవన్ నుంచి బయటకు రారు.. ఎవరికీ కనబడరు…అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ కాకుండా సీఎంకు అంత బిజీ ఏముందో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ హక్కుల కోసం మాట్లాడేందుకు గంట కూడా టైం లేదా అని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు పై కనీసం ఒక్క లేఖ కూడా కేంద్ర ప్రభుత్వానికి గానీ… కేంద్రం జలశక్తి శాఖ మంత్రికి గాని రాయలేదని ఆరోపించారు. సీఎం తో పాటు సీఎస్ కూడా లేఖ రాసే పరిస్థితిలో లేదన్నారు. మరి ఎవరి ప్రయోజనాల కోసం సీఎం సీట్లో కూర్చున్నావో చెప్పాలన్నారు బండి సంజయ్.

ఎవరికి కొమ్ముకాస్తున్నవ్ కేసీఆర్?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలిచేందుకు సిద్ధమైతే సీఎం కేసీఆర్ కనీసం మాట కూడా మాట్లాడటం లేదన్నారు బండి సంజయ్. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నావు.. ఇంకా ఎన్ని వేల కోట్లు కమీషన్లు తీసుకుంటావని ప్రశ్నించారు. అపెక్స్ కౌన్సిల్ కు హాజరై వాస్తవాలు ఏమిటో చెబితే కేంద్ర ప్రభుత్వమే ప్రాజెక్టును ఆపేస్తుంది కదా అని అన్నారు.

కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు బీజేపీ రాష్ట్ర శాఖ పలుమార్లు లేఖలు రాసిందన్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం రెండు రాష్ట్రాలకు న్యాయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందిస్తున్న కేసీఆర్ మాత్రం స్పందించడం లేదని ఆరోపించారు. ఏపీ నీటిని తరలించుకొని పోతుంటే కేసీఆర్ మాత్రం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెట్టి కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు వ్యవహారంపై సీఎం స్పందించకుంటే బీజేపీ కార్యచరణ ప్రకటిస్తుందన్నారు బండి సంజయ్.